|
| లోపలి పేజిల్లో... |
|
|
విజయవాడ నగరపాలక సభలో రభస
విజయవాడ ప్రతినిధి | టైమ్స్ అఫ్ ఆంధ్రా
విజయవాడలో కరకట్టల వెంబడి నివసించే వారిని ఖాళీ చేయించే అంశం నగరపాలక సంస్థ సమావేశాన్ని కుదిపేసింది. రాత్రి వరకు సాగిన సమావేశంలో ఈ అంశంపై విపక్షాలు అధికార పార్టీని నిలదీశాయి. ముఖ్యమంత్రి కరకట్ట వాసులను తరలించాల్సిందేనని చెబుతున్నా అధికారపక్షం మాత్రం దొంగాట ఆడుతోందని విమర్శించారు.
అయితే పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలంటే స్పష్టమైన హామీ ప్రణాళిక అవసరమని అందుకే ఇమ్మిగ్రేషన్ చేస్తున్నామని అధికారపక్షం ఎదురుదాడికి దిగింది. ఇరుపక్షాల వాగ్యూద్దంతో సభలో గందరగోళం చెలరేగింది. చివరకు మేయర్ కృష్ణలంక, బుడమేరు కరకట్ట ప్రాంతంలో ఇమ్మిగ్రేషన్ నిలిపివేయాలంటూ రూలింగ్ ఇచ్చి సభను వాయిదా వేశారు.
|
|
|
|
|